ఎయిర్ ఇండియా-విస్తారా.. 2024 కల్లా విలీనం పూర్తి
- November 29, 2022
భారత్ లోనే అగ్రగామి ఎయిర్ లైన్స్ సంస్థ అయిన ఎయిర్ ఇండియా, విస్తారా ఒక్కటి కానున్నాయి. ఈ విషయాన్ని విస్తారా మాతృ సంస్థ టాటా గ్రూప్ అధికారికంగా ప్రకటించింది. 2024 కల్లా ఎయిర్ ఇండియా-విస్తారా సంస్థల విలీనం పూర్తవుతుందని టాటా వెల్లడించింది. ప్రస్తుతం దేశంలోనే టాప్ ఎయిర్ లైన్స్ సంస్థల్లో ఎయిరిండియా ఒకటి.
ఈ సంస్థ దేశీయ సర్వీసులతోపాటు, అంతర్జాతీయ సర్వీసుల్ని నడుపుతోంది. దేశీయ విమాన సర్వీసుల్లో రెండో స్థానంలో ఉంది. అలాగే దేశం నుంచి విదేశాలకు విమానాలు నడుపుతున్న దేశీయ సంస్థల్లో మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా సంస్థకు 218 విమానాలున్నాయి. ఈ విలీనానికి సంబంధించి అన్ని అనుమతులు వచ్చాక ఈ ప్రక్రియ పూర్తవుతుందని విస్తారా సంస్థ మాతృ సంస్థ అయిన టాటా సియా తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా టాటా సియా సంస్థ ఎయిర్ ఇండియాలో రూ.2,059 కోట్లు పెట్టుబడి పెడుతుంది. దీంతో.. ఎయిర్ ఇండియాలో సియా సంస్థకు 25.1 శాతం వాటా లభిస్తుంది. మార్చి 2024 వరకు ఈ లావాదేవీల ప్రక్రియ పూర్తవుతుందని కంపెనీ భావిస్తోంది.
ఇప్పటికే ఎయిర్ ఇండియాలో టాటా సన్స్ సంస్థ పూర్తి వాటా కలిగి ఉంది. విస్తారాలో టాటా సన్స్ 51 శాతం వాటా కలిగి ఉండగా, సింగపూర్ ఎయిర్ లైన్స్ సంస్థ 49 శాతం వాటా కలిగి ఉంది. విలీనం పూర్తైతే ఈ రెండు సంస్థలు టాటా సన్స్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలోనే పని చేస్తాయి.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







