ఎమిరైటేషన్ దుర్వినియోగం: ఎమిరాటీ కంపెనీకి 4.3 మిలియన్ల జరిమానా?
- November 29, 2022
యూఏఈ: ఎమిరైటేషన్ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ.. ఓ ఎమిరాటీ కంపెనీ యజమాని తమ కంపెనీలో పని చేయడానికి 43 మంది కుటుంబ సభ్యులను నియమించుకున్నందుకు 4.3 మిలియన్ల వరకు జరిమానా విధించవచ్చుని అధికారులు తెలిపారు.ప్రభుత్వం నిర్దేశించిన ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకునేందుకు కంపెనీలు చేపట్టిన నియామకాలపై దృష్టి సారించినట్లు మానవ వనరులు, ప్రవాసీకరణ మంత్రిత్వ శాఖ (MoHRE) తెలిపింది. కుటుంబ సభ్యులను నియమించుకోవడం నిబంధనలకు విరుద్ధం కానప్పటికీ, ఎమిరేటైజేషన్ కోటాను భర్తీ చేసే క్రమంలో ఎవరైనా నకిలీ పోస్టులను క్రియేట్ చేసి వాటిల్లో బంధువులను నియమించుకుంటే వారిపై చర్యలు తప్పవని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఎమిరేటైజేషన్ సంబంధిత చట్టాలను ఉల్లంఘనకు పాల్పడితే ఆయా కంపెనీలపై చర్యలు తీసుకోవడంతోపాటు భారీ జరిమానాలను విధిస్తామని పేర్కొంది. నిబంధనలను కాదని నియమించుకునే ప్రతి ఎమిరాటీకి Dh100,000 చొప్పున జరిమానా విధించబడుతుందని, ఆయా కంపెనీ యాజమాన్యాలపై చట్టపరమైన చర్య కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- నేపాల్లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







