'వరల్డ్స్ కూలెస్ట్ వింటర్'ని ఆస్వాదించండి: షేక్ మొహమ్మద్
- December 05, 2022
యూఏఈ: 'వరల్డ్స్ కూలెస్ట్ వింటర్'ని ఆస్వాదించాలని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పిలుపునిచ్చారు. వరల్డ్స్ కూలెస్ట్ వింటర్ క్యాంపెయిన్ మూడవ సీజన్ను షేక్ మొహమ్మద్ ప్రారంభించారు. ఈ సంవత్సరం "వాల్యూస్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిపుల్ పీపుల్" థీమ్ గా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అజ్మాన్లోని అల్ జోరా నేచర్ రిజర్వ్లో జరిగిన కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూఏఈ దాని గ్రామాలు, లోయలు, పర్వతాల అందాలను పర్యాటకులకు చూపించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పిన ఒక వీడియోను షేక్ మొహమ్మద్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా అల్ జోరా వద్ద పచ్చదనంతో కూడిన సమావేశ ఫోటోలను పంచుకున్నారు. "ఈ సంవత్సరం శీతాకాల ప్రచారానికి ప్రారంభ స్థానం అజ్మాన్, దాని తెల్లని ఇసుక, ఎర్రకోట, మస్ఫౌట్ పర్వతం, మనామా లోయలు" అని షేక్ మహమ్మద్ ట్వీట్ చేశారు. షేక్ మొహమ్మద్ ప్రకారం.. వార్షిక శీతాకాల క్యాంపెయిన్ ఫలితంగా 2021లో దేశీయ పర్యాటకంలో 36 శాతం పెరుగుదల( 1.3 మిలియన్లు) నమోదైంది.
తాజా వార్తలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!









