ఈ నెల 15న తెలంగాణ పర్యటనకు రానున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
- December 07, 2022
హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా నిర్ణయించినట్లు ఈ నెల 16వ తేదీకి బదులు ఈనెల15వ తేదీననే రాష్ట్రానికి రానున్నారు. ఈనెల 15వ తేదీన కరీంనగర్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా పాల్గొంటారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17 న కరీంనగర్ లో పాదయాత్ర ముగింపు సభ నిర్వహించాల్సి ఉండగా నడ్డా షెడ్యూల్ వల్ల 16 కి కుదించారు. అయితే అదే రోజు జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించాల్సి ఉండడంతో జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన.. బహిరంగ సభ షెడ్యూల ఈనెల 15 కు మారింది. దీంతో రెండు రోజుల ముందుగానే బండి సంజయ్ పాదయాత్ర ముగియనుంది.
తాజా వార్తలు
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









