పనిమనుషులను నియమిస్తానని మోసం.. మహిళ అరెస్ట్
- December 08, 2022
దుబాయ్: పని మనుషులను ఏర్పాటు చేస్తానని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడిన 43 ఏళ్ల ఆసియా మహిళపై దుబాయ్లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ ప్రారంభించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. Dh 6,000 - Dh10,000 మధ్య కమీషన్ తీసుకొని పనిమనుషులను ఏర్పాటు చేస్తానని సదరు మహిళ ప్రకటనలో పేర్కొంది. ఆ ప్రకటన చూసిన ఓ వ్యక్తి పనిమనిషిని ఏర్పాటు చేయాలని సంప్రదించగా.. 6,000 దిర్హామ్ లను మహిళ తీసుకుంది. డబ్బు ఇచ్చిన రెండు రోజుల తరువాత ఆమె తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులోకి రాలేదు. దీంతో సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. గతంలోనూ ఇతరులను ఇలాగే మోసం చేసిందని తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







