ఐటీ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త...
- December 09, 2022
న్యూ ఢిల్లీ: ఐటీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. సెజ్ (స్పెషల్ ఎకనమిక్ జోన్) పరిధిలోని ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్కు అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఎప్పటినుంచో అమలవుతున్నప్పటికీ, దీన్ని తాజాగా వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించింది.
దీని ప్రకారం ఇకపై ‘సెజ్’లోని కంపెనీల్లో పని చేసే వంద శాతం ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం లేదా సెజ్ బయట ఎక్కడి నుంచైనా పనిచేసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రటకన విడుదల చేసింది. అయితే, దీన్ని కంపెనీలు అమలు చేసే విషయంలో కొన్ని సూచనలు చేసింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసే కంపెనీలు స్థానిక డెవలప్మెంట్ కమిషనర్కు విషయాన్ని తెలియజేయాలి. లేఖ ద్వారా అనుమతి పొందాలి. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రం హోం పొందాలి అనుకుంటే సంబంధిత గడువు ముగిసేలోగా తిరిగి అనుమతి తీసుకోవాలి. ఎంత మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు అనే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదు.
కానీ, ఆ వివరాల్ని కంపెనీలు మాత్రం నమోదు చేసుకోవాలి. కోవిడ్ సందర్భంలో ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోం పద్ధతికి అనుమతించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఏడాది పాటు మాత్రమే దీనికి అనుమతించారు. అందులోనూ 50 శాతం ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఉండేది. కానీ, తర్వాత దీన్ని పొడిగిస్తూ, వంద శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం పద్ధతిలో పని చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







