ఐదేళ్లలో ప్రధాని మోదీ విదేశాల పర్యటనల ఖర్చుల వివరాలు
- December 09, 2022
న్యూ ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దాదాపు ఎనిమిదేళ్ల కాలంలో అనేకసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. ఈ పర్యటనల్లో భాగంగా ఇతర దేశాలతో పలు వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. గత ఐదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు గడిచిన ఐదేళ్లలో 36సార్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. అందులో 31 పర్యటనలకు బడ్జెట్ నుంచి కేంద్రం ఖర్చు చేసింది.
ప్రధాని మోదీ విదేశాల పర్యటనలకు సంబంధించిన ఖర్చు వివరాలను వెల్లడించాలని సీపీఎం ఎంపీ ఎలమారమ్ కరీమ్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో ప్రధాని విదేశీ పర్యటనల కోసం రూ. 239 కోట్లుకుపై ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇటీవల జి 20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఇండోనేషియా వెళ్లారు. ఈ పర్యటనకోసం ప్రభుత్వం రూ. 32,09,760 ఖర్చు చేసిందని తెలిపారు.
సెప్టెంబరు 26-28 మధ్య ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనకు రూ. 23,86,536 ఖర్చు చేసినట్లు మంత్రి రాజ్యసభలో తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని యూరప్ పర్యటన వివరాలను తెలియజేస్తూ, మొత్తం ఖర్చు రూ. 2,15,61,304 కాగా, సెప్టెంబర్ 21-28, 2019 మధ్య కాలంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు రూ. 23,27,09,000 ఖర్చయిందని మురళీధరన్ రాజ్య సభలో తెలియజేశారు.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







