ఐదేళ్లలో ప్రధాని మోదీ విదేశాల పర్యటనల ఖర్చుల వివరాలు
- December 09, 2022
న్యూ ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దాదాపు ఎనిమిదేళ్ల కాలంలో అనేకసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. ఈ పర్యటనల్లో భాగంగా ఇతర దేశాలతో పలు వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. గత ఐదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు గడిచిన ఐదేళ్లలో 36సార్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. అందులో 31 పర్యటనలకు బడ్జెట్ నుంచి కేంద్రం ఖర్చు చేసింది.
ప్రధాని మోదీ విదేశాల పర్యటనలకు సంబంధించిన ఖర్చు వివరాలను వెల్లడించాలని సీపీఎం ఎంపీ ఎలమారమ్ కరీమ్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో ప్రధాని విదేశీ పర్యటనల కోసం రూ. 239 కోట్లుకుపై ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇటీవల జి 20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఇండోనేషియా వెళ్లారు. ఈ పర్యటనకోసం ప్రభుత్వం రూ. 32,09,760 ఖర్చు చేసిందని తెలిపారు.
సెప్టెంబరు 26-28 మధ్య ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనకు రూ. 23,86,536 ఖర్చు చేసినట్లు మంత్రి రాజ్యసభలో తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని యూరప్ పర్యటన వివరాలను తెలియజేస్తూ, మొత్తం ఖర్చు రూ. 2,15,61,304 కాగా, సెప్టెంబర్ 21-28, 2019 మధ్య కాలంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు రూ. 23,27,09,000 ఖర్చయిందని మురళీధరన్ రాజ్య సభలో తెలియజేశారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







