డిసెంబరు 14-15 తేదీల్లో యూఏఈలో భారీ ఉల్కాపాతం!
- December 09, 2022
యూఏఈ: ఈ ఏడాది చివరి ఉల్కాపాతం డిసెంబరు 14-15 రాత్రికి గరిష్ట స్థాయికి చేరుకోనున్నది. అత్యంత అద్భుతమైన ఉల్కాపాతాలతో ఆకాశం అబ్బురపరుస్తుందని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ ప్రకటించింది. నివాసితులు సంవత్సరంలో అతిపెద్ద , చివరి ఉల్కాపాతం(జెమినిడ్స్ ఉల్కాపాతం) వీక్షించే అవకాశం ఉంటుందని తెలిపారు.
జెమినిడ్స్ ఉల్కాపాతం అంటే ఏమిటి?
జెమినిడ్స్ ఉల్కాపాతంలో శిధిలాల ముక్కలు సెకనుకు 70 కిమీ వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. భూ వాతావరణంలోకి అవి ప్రవేశిస్తూనే అవి మండిపోతాయి. వాటినే ఉల్కలు అని పిలుస్తారు. అద్భుతమైన ఉల్కాపాతంలో గరిష్టంగా గంటకు 150 ఉల్కలను చూడవచ్చు. వాటిలో కొన్ని మాత్రమే అరుదుగా భూమిని చేరే అవకాశం ఉంటుంది.
ఎలా చూడాలి?
ఉల్కాపాతాన్ని వీక్షించేందుకు ప్రజలకు ఎలాంటి ప్రత్యేక పరికరాలు లేదా నైపుణ్యాలు అవసరం లేదని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ సీఈఓ హసన్ అల్ హరిరి తెలిపారు. కావలసిందల్లా స్వచ్ఛమైన ఆకాశం, సిటీ లైట్లకు దూరంగా ఉండే ప్రదేశం.
ఎక్కడ చూడొచ్చంటే?
దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ డిసెంబర్ 14న దుబాయ్లోని అల్ ఖుద్రాలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం రాత్రి 8 గంటల నుండి ఉదయం 12 గంటల వరకు జరుగుతుంది. అదేసమయంలో టెలిస్కోప్ ద్వారా చంద్రుడు, మార్స్, బృహస్పతి, శని గ్రహాలలను చూసే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు







