అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించిన యూఏఈ..
- December 12, 2022
యూఏఈ: అరబ్ ప్రపంచంలోని మొట్టమొదటి లూనార్ రోవర్ రషీద్ను విజయవంతంగా ప్రయోగించడంతో అంతరిక్ష రంగంలో యూఏఈ చరిత్ర సృష్టించింది. ఇది 385,000 కి.మీ దూరం ప్రయాణించనున్నది. లూనార్ రోవర్ రషీద్ ప్రయోగం అరబ్ ప్రపంచంలో మొదటిది కాగా.. రోవర్ విజయవంతంగా చంద్రునిపై దిగితే.. చంద్రునికపై కాలుమోపిన నాల్గవ దేశంగా యూఏఈ చరిత్ర సృష్టిస్తుంది.
రషీద్ రోవర్ లాంచ్ కు దుబాయ్ మాజీ పాలకుడు దివంగత షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ పేరు పెట్టారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11.38 గంటలకు (యూఏఈ సమయం) ప్రయోగం జరిగింది. ఎమిరేట్స్ లూనార్ మిషన్ సెప్టెంబరు 2020లో మొదటిసారిగా ప్రకటించింది. ఇప్పటివరకు టెక్నికల్ సమస్యలతో ప్రయోగాన్ని నాలుగు సార్లు వాయిదా వేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







