హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్టు
- December 12, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. విదేశాలకు డ్రగ్స్ ఎగుమతి చేస్తోన్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.9 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు సప్లై చేస్తున్నారని రాచకొండ పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి హైదరాబాద్ కు దిగుమతి చేసేవారని, కానీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు సరఫరా చేస్తున్నారని తెలపారు.
విదేశాలకు చెందిన పలువురితోపాటు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమకు అందిన సమాచారంతో వారిపై దాడి చేసి పట్టుకున్నట్లు చెప్పారు. వారి నుంచి ఎనిమిది కిలోల ఎపిడ్రిన్ స్వాధీన చేసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







