హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్టు
- December 12, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. విదేశాలకు డ్రగ్స్ ఎగుమతి చేస్తోన్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.9 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు సప్లై చేస్తున్నారని రాచకొండ పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి హైదరాబాద్ కు దిగుమతి చేసేవారని, కానీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు సరఫరా చేస్తున్నారని తెలపారు.
విదేశాలకు చెందిన పలువురితోపాటు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమకు అందిన సమాచారంతో వారిపై దాడి చేసి పట్టుకున్నట్లు చెప్పారు. వారి నుంచి ఎనిమిది కిలోల ఎపిడ్రిన్ స్వాధీన చేసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్