హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్టు
- December 12, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. విదేశాలకు డ్రగ్స్ ఎగుమతి చేస్తోన్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.9 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు సప్లై చేస్తున్నారని రాచకొండ పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి హైదరాబాద్ కు దిగుమతి చేసేవారని, కానీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు సరఫరా చేస్తున్నారని తెలపారు.
విదేశాలకు చెందిన పలువురితోపాటు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమకు అందిన సమాచారంతో వారిపై దాడి చేసి పట్టుకున్నట్లు చెప్పారు. వారి నుంచి ఎనిమిది కిలోల ఎపిడ్రిన్ స్వాధీన చేసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ అధికార నివాసభవనంలో ఘనంగా దీపావళి వేడుకలు
- ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..
- వైట్ హౌస్లో దీపావళి వేడుకలు..
- రియాద్ లో డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభం..!!
- నవంబర్ 22న నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రారంభం..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ఒమన్లో 56.8% పెరిగిన కార్డియాక్ పరికరాల దిగుమతులు..!!
- కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయులదే అగ్రస్థానం..!!
- బహ్రెయిన్ లో ఆసియా యూత్ గేమ్స్ ప్రారంభం..!!
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!