సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ శుభవార్త...
- December 12, 2022
న్యూ ఢిల్లీ: సీనియర్ సిటిజన్లకు కేంద్ర రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పనుంది.గతంలో రద్దు చేసిన టిక్కెట్లపై రాయితీని తిరిగి పునరుద్ధరించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. రెండేళ్ల క్రితం కోవిడ్ సమయంలో రైళ్లు చాలా కాలం రద్దైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలం రైళ్లు పాక్షికంగానే నడిచాయి.
అయితే, ఆ సమయంలో నష్టాల నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ అనేక విభాగాల్లో టిక్కెట్లపై ఇచ్చే రాయితీని ఎత్తేసింది. వృద్ధులకు ఇచ్చే రాయితీని కూడా తొలగించింది. దీనిపై అప్పట్లోనే కేంద్రంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. తర్వాత వృద్ధులకు ఇచ్చే రాయితీని పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. కానీ, దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని పార్లమెంటులో నలుగురు ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. ‘‘ఇటీవల ఈ అంశంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ ఏడాది ఆగష్టు 4న ఒక నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం సీనియర్ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరించాలని సూచించింది.
స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీల్లో రాయితీ ఇవ్వాలని సూచించింది. ప్రస్తుతం ప్యాసింజర్ల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా వెంటనే రాయితీ అమలు చేయాలని సూచించింది’’ అని మంత్రి ప్రకటించారు. దీంతో త్వరలోనే కేంద్రం రాయితీని పునరుద్ధరించే అవకాశాలున్నాయి. కాగా, 2019లో ప్రయాణికులకు రూ.59,837 కోట్ల రాయితీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికీ దివ్యాంగులు, రోగులు, విద్యార్థులకు రాయితీ కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం
- స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!
- మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- రక్షణ సహకారం పై ఖతార్ ప్రధాని, యూకే రక్షణ కార్యదర్శి చర్చలు..!!
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం









