వైసీపీ పై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
- December 18, 2022
            అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. జగన్ సర్కార్ లక్ష్యంగా నిప్పులు చెరిగారు. ఈసారి విమర్శల్లో బాగా డోస్ పెంచారు పవన్ కల్యాణ్. వైసీపీని దింపుతా, ముఖ్యమంత్రిని అవుతా అంటూ హాట్ కామెంట్స్ చేశారు పవన్ కల్యాణ్. ఏపీలో ప్రభుత్వం మారకపోతే, రాష్ట్రంలో అంధకారమే అని పవన్ హెచ్చరించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చూస్తానని పవన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్.
”వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదు. వైసీపీ రాకుండా చూసుకునే బాధ్యత నాది. వైసీపీ నేతలు మాట్లాడేవన్నీ పనికిమాలిన మాటలే. రాష్ట్రంలో రౌడీయిజం తగ్గాలి. బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నేతలకు బలంగా సమాధానం చెబుతా. వాళ్ల నన్ను ఎంత తొక్కాలని చూస్తే.. అంత బలంగా పైకి లేస్తా” అని పవన్ కల్యాణ్ అన్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు పవన్ కల్యాణ్. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబసభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధూళిపాళ్లలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
పోరాటం చేయనిదే మార్పు రాదన్న పవన్.. ఈ విషయాన్ని జనసేన నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. అధికార పీఠంలో కూర్చోవాలని ఆశించే ప్రతి జనసేన నాయకుడు బాధ్యతగా పనిచేయాలన్నారు పవన్. కేసులు పెడతారని భయపడొద్దని, ధైర్యంగా నిలబడాలని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనిచ్చే ప్రసక్తేలేదన్న పవన్ కల్యాణ్.. అందుకు తాను కట్టుబడి ఉన్నానని తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 - బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
 - లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 







