ప్రాపర్టీ పేరిట ఫ్రాడ్.. సోదరికి KD30,000 చెల్లించాలని వ్యక్తిని ఆదేశించిన కోర్టు
- December 19, 2022
అల్ ఐన్: ఆస్తి కోనుగోలు చేస్తానని తన నుంచి 20,000 కువైట్ దినార్లు తీసుకొని మోసం చేశాడని సోదరుడిపై ఓ మహిళా దావా వేసింది. తన సోదరుడు ఆస్తి కొనుగోలు చేయనందున తాను తీవ్రంగా నష్టపోయానని సదరు మహిళ అల్ ఐన్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్లో వేసిన దావాలో పేర్కొంది. ఇందుకుగానూ తనకు 20,000 కువైట్ దినార్లు లేదా దానికి సమానమైన UAE దిర్హామ్లు ఇప్పించాలని, అలాగే మానసిక వేదనకు Dhs240,000, పరిహారం కింద Dhs50,000 చెల్లించేలా తన సోదరుడిని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. కోర్టు ఫైల్స్ ప్రకారం.. సదరు మహిళ కువైట్లో పనిచేస్తున్నప్పుడు తన సోదరుడికి 20,000 కువైట్ దినార్లను బ్యాంక్ ద్వారా బదిలీ చేశారు. తన కోసం ఆస్తిని కొనుగోలు చేయడానికి అమౌంట్ పంపానని, కానీ అతను అలా చేయలేదని, ఆ మొత్తాన్ని తన కోసం వాడుకున్నాడని పిటిషన్ లో పేర్కొన్నారు. తాను బ్యాంకు ద్వారా తన సోదరి నుంచి అమౌంట్ ను స్వీకరించినట్లు సదరు వ్యక్తి అంగీకరించాడు. అయితే తన సోదరి అభ్యర్థన మేరకు మరొక వ్యక్తికి ఆ మొత్తాన్ని అందజేసినట్లు కోర్టు సూచించింది. కానీ దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కోర్టుకు అందివ్వలేదు. సోదరి పంపిన అమౌంట్ నుండి ప్రయోజనం పొందాడని కోర్టు ధృవీకరించింది. కాబట్టి అతను తన సోదరికి 20,000 కువైట్ దినార్లు లేదా దానికి సమానమైన UAE దిర్హామ్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే కోర్టు ఫీజులు, ఖర్చులతో పాటు పరిహారంగా Dhs10,000 అదనంగా చెల్లించాలని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







