ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు
- December 20, 2022
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసులు నమోదైన వారి శాంపిల్స్ సేకరించి, జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపాలని కేంద్రం ఆదేశించింది. కొంతకాలంగా చైనాలో కోవిడ్ కేసులు మళ్లీ భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి.
చైనాతోపాటు అమెరికా, జపాన్, బ్రెజిల్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ అంశంపై ముందుగానే కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ దీనిపై స్పందించారు. పాజిటివ్ కేసులకు సంబంధించిన శాంపిల్స్ సేకరించి, వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. దీని ద్వారా కొత్తగా విజృంభిస్తున్న కోవిడ్ రకాలను గుర్తించి, వాటి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. వారానికి 35 లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
కొత్తగా పుట్టుకొస్తున్న కోవిడ్ వైరస్ రకాలను గుర్తించడం ద్వారా వాటిని ఎదుర్కోవడం సులభమవుతుంది. చైనాలో ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగా ఉంది. రాబోయే మూడు నెలల్లో చైనాలో కోవిడ్ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. కనీసం 60 శాతం మందికి కోవిడ్ సోకే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కోవిడ్ ద్వారా మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించడం కూడా కష్టమవుతోందంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







