దుబాయ్ లో ఘనంగా తెలుగు వారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు

- December 21, 2022 , by Maagulf
దుబాయ్ లో ఘనంగా తెలుగు వారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు

దుబాయ్: దుబాయ్ లో ఉన్న క్రైస్తవ సంఘాల కలయికతో బ్రదర్ సామ్యూల్ రత్నం నీలా
ఆధ్వర్యంలో ఘనంగా దెయిరా క్రీక్  Dhow Cruise నందు ఘనంగా క్రిస్మస్ వేడుకలు  జరుపుకున్నారు.

ఈ సందర్భంగా క్రైస్తవులు అందరూ రెండు వందల కుటుంబాలు,వారి పిల్లలతో కలిసి వేడుకలను జరుపుకున్నారు.ఇందులో భాగంగా క్రైస్తవ సంఘాల క్వయర్ తో కలిసి అందరూ పాటలు, ప్రార్థనలతో అలరించారు.బ్రదర్ అరవింద్ వుడ్స్-సాక్షోఫోన్, సుజ్ఞాన్,యోసేబు,యేసు,మేరి జ్యోతి బృందం వారు క్రిస్మస్ కేరల్స్ తో గాత్ర కచేరితో అలరించారు.ఈ కార్యక్రమంలో దుబాయ్ లో వివిధ సంఘాల పాస్టర్స్ మరియు  సంఘ పెద్దలలో పాటు సామాజిక కార్యకర్తలు సిస్టర్ ఎస్తేర్, పాస్టర్. ఫ్రాన్సిస్, పాస్టర్.అగ్రిప్ప రాజు, పాస్టర్.సంపదరావు, పాస్టర్.రత్నరాజు,ముక్కు తులసి కుమార్, రవి కిరణ్ కోడి , కంబాల మహేందర్ రెడ్డి,బ్రదర్.సతీష్ ఏలేటి తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com