రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు మాస్క్లు ధరించండి: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
- December 21, 2022
న్యూఢిల్లీ: చైనాలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈరోజు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించారు. మీటింగ్ అనంతరం మంత్రి ట్వీట్ చేశారు. కోవిడ్ ఇంకా ముగిసిపోలేదని, అందరూ అలర్ట్గా ఉండాలని, నిఘా పెంచాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు మాస్క్లు ధరించాలని కేంద్ర ప్రభుత్వం సూచన చేసింది.చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మంత్రి మాండవీయ మీటింగ్లో పాల్గొన్న అధికారులు అందరూ మాస్క్లు ధరించారు.
తాజా వార్తలు
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి







