ధహిరాలో బయటపడ్డ పురాతన నగరం
- December 21, 2022
మస్కట్: వార్సా విశ్వవిద్యాలయం పోలిష్ మిషన్ సహకారంతో ధహిరాలో నిర్వహించిన తవ్వకాల్లో 1వ సహస్రాబ్ది బీసీ(ఇనుప యుగం) నాటి పురాతన నగరాన్ని కొనుగొన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం (MHT) ప్రకటించింది. ఆరవ సీజన్లో ఐన్ బని సైదా పురావస్తు ప్రదేశంలో జరిపిన త్రవ్వకాల్లో, ఇనుప యుగం నాటి పురాతన నగరం అవశేషాలు గుర్తించినట్లు పేర్కొంది. వార్సా విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ పీటర్ బెలిన్స్కీ మాట్లాడుతూ.. తాము ఒక చిన్న పురాతన నగరాన్ని కనుగొన్నామని, అది ఆ సమయంలో ఏర్పడిన సామాజిక పరిస్థితిని ప్రతిబింబిస్తుందన్నారు. ఆ స్థలంలో చేతితో తయారు చేయబడిన ఒక అలంకరించబడిన కుండల గిన్నెను కూడా గుర్తించామని తెలిపారు. గిన్నెతో పాటు, ఇతర కుండల పాత్రలు, నిచ్చెనలు, వంట స్టవ్లు కూడా కొత్తగా గుర్తించిన సైట్లో కనుగొన్నట్లు బెలిన్స్కీ తెలిపారు. కొత్తగా గుర్తించిన ప్రాంతంలో ఒక నాయకుడు లేదా పాలకుడు తన కుటుంబంతో నివసించేవాడన్నారు. ధహిరాలోని హెరిటేజ్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ డైరెక్టర్ అలీ బిన్ ఖమీస్ అల్ సుదైరి మాట్లాడుతూ.. ఈ ప్రదేశం సహమ్లోని బ్యాట్, సలుట్, దహ్వా వంటి ఇతర పురావస్తు ప్రదేశాలతో చారిత్రక సంబంధం కలిగి ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









