ధహిరాలో బయటపడ్డ పురాతన నగరం
- December 21, 2022
మస్కట్: వార్సా విశ్వవిద్యాలయం పోలిష్ మిషన్ సహకారంతో ధహిరాలో నిర్వహించిన తవ్వకాల్లో 1వ సహస్రాబ్ది బీసీ(ఇనుప యుగం) నాటి పురాతన నగరాన్ని కొనుగొన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం (MHT) ప్రకటించింది. ఆరవ సీజన్లో ఐన్ బని సైదా పురావస్తు ప్రదేశంలో జరిపిన త్రవ్వకాల్లో, ఇనుప యుగం నాటి పురాతన నగరం అవశేషాలు గుర్తించినట్లు పేర్కొంది. వార్సా విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ పీటర్ బెలిన్స్కీ మాట్లాడుతూ.. తాము ఒక చిన్న పురాతన నగరాన్ని కనుగొన్నామని, అది ఆ సమయంలో ఏర్పడిన సామాజిక పరిస్థితిని ప్రతిబింబిస్తుందన్నారు. ఆ స్థలంలో చేతితో తయారు చేయబడిన ఒక అలంకరించబడిన కుండల గిన్నెను కూడా గుర్తించామని తెలిపారు. గిన్నెతో పాటు, ఇతర కుండల పాత్రలు, నిచ్చెనలు, వంట స్టవ్లు కూడా కొత్తగా గుర్తించిన సైట్లో కనుగొన్నట్లు బెలిన్స్కీ తెలిపారు. కొత్తగా గుర్తించిన ప్రాంతంలో ఒక నాయకుడు లేదా పాలకుడు తన కుటుంబంతో నివసించేవాడన్నారు. ధహిరాలోని హెరిటేజ్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ డైరెక్టర్ అలీ బిన్ ఖమీస్ అల్ సుదైరి మాట్లాడుతూ.. ఈ ప్రదేశం సహమ్లోని బ్యాట్, సలుట్, దహ్వా వంటి ఇతర పురావస్తు ప్రదేశాలతో చారిత్రక సంబంధం కలిగి ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







