మెడిసిన్ ఫీ ఎఫెక్ట్:అసుపత్రులలో 60 శాతం తగ్గిన ప్రవాసుల సంఖ్య
- December 22, 2022
కువైట్: కొత్త మెడిసిన్ ఫీ కారణంగా ప్రభుత్వ క్లినిక్లు, ఆసుపత్రులను సందర్శించే ప్రవాసుల సంఖ్య 60 శాతం వరకు తగ్గిందని మెడికల్ రంగ నిపుణులు ఓ నివేదికను విడుదల చేశారు. ఆ నివేదిక ప్రకారం.. ప్రవాసులకు సూచించిన మందులకు రుసుము వసూలు చేయాలనే నిర్ణయం అమలులోకి వచ్చిన రెండు రోజుల్లో కొన్ని క్లినిక్లలో రోజుకు 1,200 మంది రోగులకు సేవలందించే సందర్శకుల సంఖ్య 400 కంటే తక్కువకు పడిపోయింది. దాదాపు 100 మంది వ్యక్తులు వైద్యం కోసం నమోదు చేసుకున్నా మందులు తీసుకోకుండా కేవలం పరీక్షలతో సరిపెట్టుకున్నారు. అయితే డయాబెటిస్ క్లినిక్లలో సందర్శకుల సంఖ్యలో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రమాద విభాగాల్లోని సందర్శకుల సంఖ్య కూడా ప్రభావితం కాలేదని సదరు నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







