5 మిలియన్లకు చేరువైన ఒమన్ జనాభా
- December 23, 2022
మస్కట్: నవంబర్ 2022 చివరి వరకు 2 మిలియన్ల ప్రవాసులతో సహా ఒమన్ సుల్తానేట్ జనాభా సుమారు 5 మిలియన్లకు చేరుకుంది. ఒమన్ సుల్తానేట్ జనాభా గత నవంబర్ చివరి నాటికి 4,904,047కి చేరుకోగా.. గత అక్టోబర్లో జనాభా 4,876,125గా ఉన్నది. కేవలం ఒక నెలలోనే జనాభా 27,922 పెరిగడం గమనార్హం. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ గణాంకాల ప్రకారం, గత నవంబర్ చివరి నాటికి ఒమానీల సంఖ్య 2,861,417కి చేరుకుంది. గత అక్టోబర్లో వారి సంఖ్య 2,856,777. నెలలో 4,640 మంది పెరిగారు. గణాంకాల ప్రకారం, గత నవంబర్ చివరి నాటికి ఒమన్ సుల్తానేట్లో ప్రవాసుల సంఖ్య 2,042,630కి చేరుకుంది. గత అక్టోబర్లో వారి సంఖ్య 2,019,348గా ఉన్నది. నెల వ్యవధిలో ఇది 23,282 పెరిగింది. జనసాంద్రత పరంగా మస్కట్ గవర్నరేట్ 1,463,218 మందితో మొదటి స్థానంలో ఉంది. అల్ వుస్తా గవర్నరేట్ 58,519 మందితో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ అన్ని గవర్నరేట్లలో అతి తక్కువ జనసాంద్రత కలిగి ఉన్నది.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







