5 మిలియన్లకు చేరువైన ఒమన్ జనాభా
- December 23, 2022
మస్కట్: నవంబర్ 2022 చివరి వరకు 2 మిలియన్ల ప్రవాసులతో సహా ఒమన్ సుల్తానేట్ జనాభా సుమారు 5 మిలియన్లకు చేరుకుంది. ఒమన్ సుల్తానేట్ జనాభా గత నవంబర్ చివరి నాటికి 4,904,047కి చేరుకోగా.. గత అక్టోబర్లో జనాభా 4,876,125గా ఉన్నది. కేవలం ఒక నెలలోనే జనాభా 27,922 పెరిగడం గమనార్హం. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ గణాంకాల ప్రకారం, గత నవంబర్ చివరి నాటికి ఒమానీల సంఖ్య 2,861,417కి చేరుకుంది. గత అక్టోబర్లో వారి సంఖ్య 2,856,777. నెలలో 4,640 మంది పెరిగారు. గణాంకాల ప్రకారం, గత నవంబర్ చివరి నాటికి ఒమన్ సుల్తానేట్లో ప్రవాసుల సంఖ్య 2,042,630కి చేరుకుంది. గత అక్టోబర్లో వారి సంఖ్య 2,019,348గా ఉన్నది. నెల వ్యవధిలో ఇది 23,282 పెరిగింది. జనసాంద్రత పరంగా మస్కట్ గవర్నరేట్ 1,463,218 మందితో మొదటి స్థానంలో ఉంది. అల్ వుస్తా గవర్నరేట్ 58,519 మందితో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ అన్ని గవర్నరేట్లలో అతి తక్కువ జనసాంద్రత కలిగి ఉన్నది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







