5 మిలియన్లకు చేరువైన ఒమన్ జనాభా
- December 23, 2022
మస్కట్: నవంబర్ 2022 చివరి వరకు 2 మిలియన్ల ప్రవాసులతో సహా ఒమన్ సుల్తానేట్ జనాభా సుమారు 5 మిలియన్లకు చేరుకుంది. ఒమన్ సుల్తానేట్ జనాభా గత నవంబర్ చివరి నాటికి 4,904,047కి చేరుకోగా.. గత అక్టోబర్లో జనాభా 4,876,125గా ఉన్నది. కేవలం ఒక నెలలోనే జనాభా 27,922 పెరిగడం గమనార్హం. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ గణాంకాల ప్రకారం, గత నవంబర్ చివరి నాటికి ఒమానీల సంఖ్య 2,861,417కి చేరుకుంది. గత అక్టోబర్లో వారి సంఖ్య 2,856,777. నెలలో 4,640 మంది పెరిగారు. గణాంకాల ప్రకారం, గత నవంబర్ చివరి నాటికి ఒమన్ సుల్తానేట్లో ప్రవాసుల సంఖ్య 2,042,630కి చేరుకుంది. గత అక్టోబర్లో వారి సంఖ్య 2,019,348గా ఉన్నది. నెల వ్యవధిలో ఇది 23,282 పెరిగింది. జనసాంద్రత పరంగా మస్కట్ గవర్నరేట్ 1,463,218 మందితో మొదటి స్థానంలో ఉంది. అల్ వుస్తా గవర్నరేట్ 58,519 మందితో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ అన్ని గవర్నరేట్లలో అతి తక్కువ జనసాంద్రత కలిగి ఉన్నది.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







