కార్ల విక్రయ వ్యాపారిని మోసం చేసిన వ్యక్తులకు జైలుశిక్ష, జరిమానా
- December 25, 2022
దుబాయ్: కార్ల విక్రయ వ్యాపారిని మోసం చేసి అతని వాహనాన్ని దొంగిలించిన ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్షతోపాటు 760,000 దిర్హామ్ల జరిమానాను కోర్టు విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. బాధితుడికి దుబాయ్లో లగ్జరీ కార్ల అమ్మకంలో ప్రత్యేకత కలిగిన కంపెనీ ఉంది. ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లో లగ్జరీ కారు అమ్మకం ప్రకటన చూసి ఓ ఎమిరాటి పేరుతో నిందితులు తనను సంప్రదించినట్లు తెలిపారు. లగ్జరీ కారు ఫోటోలను నిందితులకు పంపిన తర్వాత కోనుగోలు ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. కారును ఒక ముఖ్యమైన వ్యక్తి కోసం కొనుగోలు చేస్తున్నానని నమ్మబలికారు. 761,920 దిర్హాలకు లగ్జరీ కారును కొనుగోలు చేసేందుకు నిందితులు అంగీకరించారని బాధితుడు తెలిపారు. కారు కొనుగోలు మొత్తాన్ని చెల్లించిక ముందే కారు ఓనర్ షిప్ ను తమ పేరుమీద బదిలీ చేయాలని కోరడంతో తాను వారి మాటలను నమ్మి అలాగే చేశానన్నారు. ఆ తర్వాత సదరు కారును మరో ఎమిరేట్లోని షోరూమ్లో కారును అమ్మకానికి ఉంచినట్లు తెలుసుకుని మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించినట్లు బాధితుడు పేర్కొన్నాడు. కేసును విచారించిన కోర్టు.. ఇద్దరు నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష, 761,920 దిర్హామ్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







