వర్షపు గుంటలో మునిగి 13 ఏళ్ల బాలుడు, అతని తండ్రి మృతి
- December 29, 2022
యూఏఈ: రస్ అల్ ఖైమాలోని వాడి షాహలో నీటి గుంటలో మునిగి 13 ఏళ్ల చిన్నారి, అతని 39 ఏళ్ల తండ్రి బుధవారం సాయంత్రం మరణించారు. సంఘటనపై సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్నామని, అప్పటికే వారు మరణించారని రస్ అల్ ఖైమా పోలీస్ యొక్క మెరైన్ రెస్క్యూ శాఖ వెల్లడించింది. గుంటలో మునిగిన కొడుకును రక్షించే క్రమంలో చిన్నారి తండ్రి కూడా మునిగిపోయాడని రెస్క్యూ శాఖ తెలిపింది. మెరైన్ రెస్క్యూ అధికారులు మృతదేహాలను వెలికితీసి మార్చురీకి తరలించారు. చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులకు కేసును రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి