సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత..
- December 29, 2022
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICCI) గురువారం పురుషుల టీ20 క్రికెట్ ఆప్ ది ఇయర్-2022 కోసం నామినీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండియా స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ఎంపికయ్యారు. భారత్ నుంచి నామినీ జాబితాలో చేరిన ఏకైక బ్యాటర్ సూర్యకుమార్. పొట్టి ఫార్మాట్లో ఈ ఏడాది తన అద్భుతమైన ఆటతీరును సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శించారు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ తో పాటు మరో ముగ్గురు ఉన్నారు.
శ్రీలంకతో స్వదేశంలో జరిగే టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్కు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ పొందిన విషయం విధితమే. ప్రస్తుతం ఆ ఆనందంలోఉన్న సూర్యాకు తాజా వార్త అదనపు సంతోషాన్ని తెచ్చిపెట్టింది. సూర్యకుమార్తో పాటు జింబాబ్వే స్టార్ ఆల్ రౌండర్ సికందర్ రజా, ఇంగ్లాండ్ సంచలనం శామ్ కుర్రాన్, పాకిస్థాన్ వికెట్ కీపర్, బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్లు నామినేట్ జాబితాలు ఉన్నారు.
సూర్యకుమార్ యాదవ్ 2022లో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఒకే ఏడాదిలో టీ20 పార్మాట్లో వెయ్యికిపైగా పరుగులు సాధించిన తొలి భారతీయ ఆటగాడు. ప్రపంచ స్థాయిలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది 31 మ్యాచ్లు ఆడియన సూర్య.. రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలతో 1,164 పరుగులు చేశాడు. జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా 24 మ్యాచ్లు ఆడి 735 పురుగులు చేశాడు. 25 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంగ్లండ్ ఆల్రౌండర్ శామ్ కుర్రాన్ 19 మ్యాచ్ లు ఆడి 67 పరుగులు చేసి, 25 వికెట్లు పడగొట్టాడు. పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్.. 25 మ్యాచ్లలో 996 పరుగులు చేశాడు. ఇందులో 10 అర్థ సెంచరీలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ







