మద్యం అమ్మకాలపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
- December 29, 2022
హైదరాబాద్: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు చేసేందుకు అనుమతించింది. బార్స్, పబ్స్, లిక్కర్ షాప్స్ అర్థరాత్రి వరకు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రిటైల్ షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, 2బీ లైసెన్స్ గల బార్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. గతంలో రెండేళ్లుగా కరోనా సమయంలో న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం అమ్మకాలు నిలిచిపోయి, వ్యాపారులు నష్టపోయారని, అందువల్ల ఈ వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో మందు షాపులు, బార్లు, పబ్బుల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే మందు తప్పనిసరిగా ఉండాల్సిందే.
సాధారణంగా ఇలాంటి సందర్భంలో ఒక గంట మాత్రమే అదనంగా మద్యం విక్రయాలు జరిపేందుకు అనుమతిస్తారు. అయితే, ఈ సారి మాత్రం అర్ధరాత్రి వరకు మద్యం అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతించడం విశేషం. ఈ లెక్కన ఈ సారి డిసెంబర్ 31న మద్యం విక్రయాలు ఊహించని స్థాయిలో జరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!