అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పై కేసు నమోదు
- December 30, 2022
తెలంగాణ: అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదని..మతవిద్వేషానలు సహించేదిలేదని స్పష్టంచేశారు ఎస్పీ. చట్టప్రకారం నరేష్ కు శిక్ష పడేలా చూస్తామని అయ్యప్ప స్వామిలకు హామీ ఇచ్చారు ఎస్పీ. ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడినా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాగా రెండు రోజుల క్రితం నారాయణపేట కోస్గి శివాజీ చౌక్ వద్ద అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. దీంతో అయ్యప్ప స్వామి మాల ధరించిన కొంతమంది స్వాములు నరేశ్ పై దాడి చేశారు. కోస్గిలో నరేష్ పై అతడు తప్పించుకుని వెళ్లే ప్రయత్నం చేయగా పరిగెత్తించి మరీ కొట్టారు. ఇదే సమయంలో సమీపంలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకుని నరేష్ పై దాడి చేసిన అయ్యప్ప భక్తులను అడ్డుకున్నారు. భైరి నరేష్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. నరేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప భక్తులు నిరసన చేపట్టారు.
దీంతో జిల్లా ఎస్పి కోటిరెడ్డి స్పందిస్తూ ఎవరి మనోభావాలు ఎవరు దెబ్బతీయకూడదని అటువంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నరేశ్ పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చట్ట ప్రకాశం చర్యలు తీసుకుంటామని అయ్యప్ప భక్తులకు హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







