'స్టాప్' సైన్ ఉల్లంఘిస్తే Dh1,000, 10 బ్లాక్ పాయింట్లు
- January 02, 2023
యూఏఈ:సెలవులు ముగియడంతో విద్యార్థులు పాఠశాలలకు తిరిగి వస్తున్నందున వాహనదారులు జాగ్రత్తగా నడపాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అబుధాబి పోలీసులు కోరారు. పాఠశాల బస్సులో విద్యార్థులను దింపుతున్నప్పుడు లేదా ఎక్కించేటప్పుడు 'స్టాప్' గుర్తు తెరిచినప్పుడు వాహనదారులు తమ వాహనాలను పూర్తిగా ఆపివేయాలని కోరారు. అబుధాబి పోలీసులు వాహనదారులకు 'స్టాప్' గుర్తును ప్రదర్శించినప్పుడు రహదారిపై వామనాలు ఆపాలని, విద్యార్థులు సురక్షితంగా వెళ్లేలా పాఠశాల బస్సు నుండి వాహనాలను ఐదు మీటర్ల దూరంలో నిలిపివేయాలని సూచించారు. హించాలని గుర్తు చేశారు. స్టాప్ సిగ్నల్ ను పట్టించుకోని వాహనదారులకు 1,000 దిర్హామ్ల జరిమానా విధించబడుతుందని, వారి లైసెన్స్లకు వ్యతిరేకంగా పది బ్లాక్ పాయింట్లు విధిస్తామని హెచ్చరించారు. అలాగే పాఠశాల బస్సు డ్రైవర్లు విద్యార్థులను ఎక్కించేటప్పుడు లేదా దింపుతున్నప్పుడు తప్పనిసారిగా 'స్టాప్' సంకేతాలను ప్రదర్శించాలన్నారు. అలా చేయని డ్రైవర్లకు 500 దిర్హామ్ జరిమానా, ఆరు బ్లాక్ పాయింట్లు విధిస్తామన్నారు. తల్లిదండ్రులు కూడా ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, పాఠశాలల వద్ద వాహనాలను పార్కింగ్ చేయడానికి నిర్దేశించిన స్థలాలను ఉపయోగించుకోవాలన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







