మంత్రి కేటీఆర్ను కలిసిన డీజీపీ అంజనీకుమార్
- January 02, 2023
హైదరాబాద్: డీజీపీ అంజనీకుమార్ నేడు మంత్రి కేటీఆర్ ను కలిశారు. మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం కొత్త డీజీపీగా అంజనీకుమార్ కు బాధ్యతలు అప్పగించింది. మహేందర్ రెడ్డి నుండి బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్ మర్యాదపూర్వకంగా కేటీఆర్ ను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
1990 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అంజనీకుమార్ ఉమ్మడి రాష్ట్రంలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఐపీఎస్ శిక్షణ అనంతరం వరంగల్ జిల్లా జనగామ ఏఎస్పీగా తొలి పోస్టింగ్ పొందిన ఆయన ఆ తరువాత మహబూబ్నగర్, ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు. 1998లో ఐక్య రాజ్య సమితి శాంతిపరిరక్షక దళానికి ఎంపికై బోస్నియా-హెర్జిగోవినాలో సంవత్సరంపాటు విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన రెండుసార్లు ఐక్యరాజ్య సమితి శాంతి పతకాన్ని అందుకున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్గా, గ్రేహౌండ్స్ చీఫ్గా, నిజామాబాద్ రేంజ్ల డీఐజీగా, వరంగల్ ఐజీగా, హైదరాబాద్ ఏసీపీగా, సీపీగా, ఏసీబీ డీజీగా వివిధ హోదాల్లో అంజనీకుమార్ పని చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







