మంత్రి కేటీఆర్ను కలిసిన డీజీపీ అంజనీకుమార్
- January 02, 2023
హైదరాబాద్: డీజీపీ అంజనీకుమార్ నేడు మంత్రి కేటీఆర్ ను కలిశారు. మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం కొత్త డీజీపీగా అంజనీకుమార్ కు బాధ్యతలు అప్పగించింది. మహేందర్ రెడ్డి నుండి బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్ మర్యాదపూర్వకంగా కేటీఆర్ ను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
1990 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అంజనీకుమార్ ఉమ్మడి రాష్ట్రంలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఐపీఎస్ శిక్షణ అనంతరం వరంగల్ జిల్లా జనగామ ఏఎస్పీగా తొలి పోస్టింగ్ పొందిన ఆయన ఆ తరువాత మహబూబ్నగర్, ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు. 1998లో ఐక్య రాజ్య సమితి శాంతిపరిరక్షక దళానికి ఎంపికై బోస్నియా-హెర్జిగోవినాలో సంవత్సరంపాటు విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన రెండుసార్లు ఐక్యరాజ్య సమితి శాంతి పతకాన్ని అందుకున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్గా, గ్రేహౌండ్స్ చీఫ్గా, నిజామాబాద్ రేంజ్ల డీఐజీగా, వరంగల్ ఐజీగా, హైదరాబాద్ ఏసీపీగా, సీపీగా, ఏసీబీ డీజీగా వివిధ హోదాల్లో అంజనీకుమార్ పని చేశారు.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







