అపార్ట్మెంట్లోకి చొరబడి dh1.1 మిలియన్ల చోరీ.. ఐదుగురు వ్యక్తులకు జైలుశిక్ష
- January 03, 2023
దుబాయ్: పోలీసులమని పెట్టుబడిదారుడి నుండి 1.1 మిలియన్ దిర్హామ్లను దోచుకున్నందుకు ఐదుగురు వ్యక్తులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఈ కేసు గత మార్చిలో నమోదైంది. పెట్టుబడిదారుడు తన నుండి, అతని బంధువు నుండి 1.1 మిలియన్ దిర్హామ్లను కొందరు వ్యక్తులు పోలీసులమని దొంగిలించారని రిపోర్టు దాఖలు చేశారు. దుండగులు అపార్ట్మెంట్లోకి ప్రవేశించి బాధితులపై దాడి చేశారు. డ్రాయర్లో ఉన్న 1.1 మిలియన్ దిర్హామ్లను తీసుకొని పారిపోయారు. దర్యాప్తు బృందం ముఠా సభ్యులను గుర్తించి, వారిలో ఒకరిని దుబాయ్ విమానాశ్రయంలో దేశం విడిచి వెళుతుండగా అరెస్టు చేసింది. అతడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మిగతా వారిని అరెస్ట్ చేశారు. దుబాయ్ క్రిమినల్ కోర్ట్ వారందరినీ దోషులుగా నిర్ధారించింది. వారికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష ముగిసిన తర్వాత బహిష్కరించాలని ఆదేశించింది. అప్పీల్ కోర్టు ఈ తీర్పును సమర్థించింది.
తాజా వార్తలు
- డ్రెస్సింగ్ రూమ్లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు







