యుక్రెయిన్ రాకెట్ దాడిలో 63 మంది రష్యా సైనికులు మృతి
- January 03, 2023
రష్యా, యుక్రెయిన్ మధ్యం కొనసాగుతూనేవుంది. యుక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. యుక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో రష్యాకు చెందిన 63 మంది సైనికులు మరణించారు. ఈ విషయాన్ని రష్యా కూడా ధృవీకరించింది.ఈ శాన్య డోనెట్స్ ప్రాంతంలోని రష్యా సైనిక బలగాల క్యాంపు లక్ష్యంగా అమెరికా సరఫరా చేసిన ఆరు రాకెట్లను యుక్రెయిన్ ప్రయోగించిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది.
వీటిలో రెండు రాకెట్లను కూల్చి వేశామని చెప్పింది. యుక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో తమ సైనికులు 63 మంది మృతి చెందారని రష్యా ప్రకటించింది. కాగా, తమ దాడిలో 400 మంది రష్యా సైనికులు మృతి చెందారని, మరో 300 మంది గాయపడ్డారని యుక్రెయిన్ వెల్లడించింది.
మరోవైపు యుక్రెయిన్ రాజధాని కీవ్ లోని విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేసే లక్ష్యంతో రష్యా ప్రయోగించిన 40 డ్రోన్లను తమ వాయుసేన కూల్చి వేసిందని యుక్రెయిన్ పేర్కొంది. కాగా, సరిహద్దులోని తమ గ్రామంపై కూడా యుక్రెయిన్ డ్రోన్ తో దాడి చేసిందని రష్యా ఆరోపించడం గమనార్హం.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









