యుక్రెయిన్ రాకెట్ దాడిలో 63 మంది రష్యా సైనికులు మృతి
- January 03, 2023
రష్యా, యుక్రెయిన్ మధ్యం కొనసాగుతూనేవుంది. యుక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. యుక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో రష్యాకు చెందిన 63 మంది సైనికులు మరణించారు. ఈ విషయాన్ని రష్యా కూడా ధృవీకరించింది.ఈ శాన్య డోనెట్స్ ప్రాంతంలోని రష్యా సైనిక బలగాల క్యాంపు లక్ష్యంగా అమెరికా సరఫరా చేసిన ఆరు రాకెట్లను యుక్రెయిన్ ప్రయోగించిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది.
వీటిలో రెండు రాకెట్లను కూల్చి వేశామని చెప్పింది. యుక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో తమ సైనికులు 63 మంది మృతి చెందారని రష్యా ప్రకటించింది. కాగా, తమ దాడిలో 400 మంది రష్యా సైనికులు మృతి చెందారని, మరో 300 మంది గాయపడ్డారని యుక్రెయిన్ వెల్లడించింది.
మరోవైపు యుక్రెయిన్ రాజధాని కీవ్ లోని విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేసే లక్ష్యంతో రష్యా ప్రయోగించిన 40 డ్రోన్లను తమ వాయుసేన కూల్చి వేసిందని యుక్రెయిన్ పేర్కొంది. కాగా, సరిహద్దులోని తమ గ్రామంపై కూడా యుక్రెయిన్ డ్రోన్ తో దాడి చేసిందని రష్యా ఆరోపించడం గమనార్హం.
తాజా వార్తలు
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు







