11 కిలోల బంగారం గెలుచుకున్న 44 మంది విజేతలు
- January 10, 2023
యూఏఈ: దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా 44 మంది 11 కిలోల బంగారాన్ని గెలుచుకున్నారు. దుబాయ్ జ్యువెలరీ గ్రూప్ ప్రకారం, ఇప్పటివరకు 44 మంది విజేతలుగా నిలిచారు. ఒక్కొక్కరు పావు కిలో బంగారం గెలుచుకున్నారు. 245 భాగస్వామ్య అవుట్లెట్లలో షాపింగ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. జనవరి 29, 2023 వరకు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ జరుగనున్నది. ఈ సందర్భంగా ఒక్కొక్కరు పావు కిలో బంగారాన్ని గెలుచుకోవడానికి Dh500 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో ఆభరణాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు విజేతలలో ఎక్కువ మంది భారతీయులు(27మంది) ఉండగా.. ఆ తర్వాత స్థానంలో పాకిస్థానీలు, బంగ్లాదేశ్, యూఏఈ జాతీయులున్నారు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









