11 కిలోల బంగారం గెలుచుకున్న 44 మంది విజేతలు

- January 10, 2023 , by Maagulf
11 కిలోల బంగారం గెలుచుకున్న 44 మంది విజేతలు

యూఏఈ: దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా 44 మంది 11 కిలోల బంగారాన్ని గెలుచుకున్నారు. దుబాయ్ జ్యువెలరీ గ్రూప్ ప్రకారం, ఇప్పటివరకు 44 మంది విజేతలుగా నిలిచారు. ఒక్కొక్కరు పావు కిలో బంగారం గెలుచుకున్నారు. 245 భాగస్వామ్య అవుట్‌లెట్‌లలో షాపింగ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. జనవరి 29, 2023 వరకు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ జరుగనున్నది. ఈ సందర్భంగా ఒక్కొక్కరు పావు కిలో బంగారాన్ని గెలుచుకోవడానికి Dh500 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో ఆభరణాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.  ఇప్పటివరకు విజేతలలో ఎక్కువ మంది భారతీయులు(27మంది) ఉండగా.. ఆ తర్వాత స్థానంలో పాకిస్థానీలు, బంగ్లాదేశ్, యూఏఈ జాతీయులున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com