హజ్ యాత్రికులకు శుభవార్త.. మూడేళ్ల తర్వాత పరిమితి ఎత్తివేత
- January 10, 2023
సౌదీ: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో మూడేళ్ల తర్వాత హజ్ యాత్రికుల సంఖ్యపై పరిమితులను సౌదీ ఎత్తివేసింది. ఈ మేరకు హజ్, ఉమ్రా మంత్రి తౌఫిక్ అల్-రబియా రియాద్లో విలేకరులతో తెలిపారు. యాత్రికుల సంఖ్య, వయోపరిమితిపై పరిమితులు లేకుండా మహమ్మారికి ముందు ఉన్న స్థితికి చేరుకుందన్నారు. 2019 లో సుమారు 2.5 మిలియన్ల మంది హజ్ యాత్రలో పాల్గొన్నారు. మహమ్మారి కారణంగా తరువాతి రెండు సంవత్సరాల్లో ఈ సంఖ్యను భారీగా తగ్గించారు. 2022లో దాదాపు 900,000 మంది యాత్రికులు హజ్ యాత్రను పూర్తి చేశారు. విదేశాల నుండి 780,000 మంది యాత్రికులు పవిత్ర నగరాలైన మక్కా, మదీనాలను సందర్శించారు. కరోనా ఆంక్షల సమయంలో యాత్రికులు 65 ఏళ్లలోపు ఉండాలని, కోవిడ్-19 వ్యాక్సిన్లు తీసుకోవడంతోపాటు కొవిడ్ నెగిటివ్ రిపోర్టు సమర్పించాలని షరతులు పెట్టారు.
తాజా వార్తలు
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు







