హజ్ యాత్రికులకు శుభవార్త.. మూడేళ్ల తర్వాత పరిమితి ఎత్తివేత
- January 10, 2023
సౌదీ: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో మూడేళ్ల తర్వాత హజ్ యాత్రికుల సంఖ్యపై పరిమితులను సౌదీ ఎత్తివేసింది. ఈ మేరకు హజ్, ఉమ్రా మంత్రి తౌఫిక్ అల్-రబియా రియాద్లో విలేకరులతో తెలిపారు. యాత్రికుల సంఖ్య, వయోపరిమితిపై పరిమితులు లేకుండా మహమ్మారికి ముందు ఉన్న స్థితికి చేరుకుందన్నారు. 2019 లో సుమారు 2.5 మిలియన్ల మంది హజ్ యాత్రలో పాల్గొన్నారు. మహమ్మారి కారణంగా తరువాతి రెండు సంవత్సరాల్లో ఈ సంఖ్యను భారీగా తగ్గించారు. 2022లో దాదాపు 900,000 మంది యాత్రికులు హజ్ యాత్రను పూర్తి చేశారు. విదేశాల నుండి 780,000 మంది యాత్రికులు పవిత్ర నగరాలైన మక్కా, మదీనాలను సందర్శించారు. కరోనా ఆంక్షల సమయంలో యాత్రికులు 65 ఏళ్లలోపు ఉండాలని, కోవిడ్-19 వ్యాక్సిన్లు తీసుకోవడంతోపాటు కొవిడ్ నెగిటివ్ రిపోర్టు సమర్పించాలని షరతులు పెట్టారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







