సికింద్రాబాద్-విశాఖపట్నంకి వందేభారత్ ఎక్స్ప్రెస్..
- January 10, 2023
న్యూ ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వందేభారత్ ఎక్స్ప్రెస్’ పట్టాలెక్కేందుకు సర్వం సిద్దమవుతోంది. సికింద్రాబాద్–విశాఖపట్నం– సికింద్రాబాద్ మధ్య ఈ ట్రైన్ పరుగులు పెట్టనుంది.ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనవరి 19న ప్రారంభించనున్నారు.వాస్తవానికి ఈ ట్రైన్ను మొదటగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకే అనుకున్నారు. అయితే.. ట్రాక్ అప్గ్రేడేషన్ పనులు విజయవాడ-విశాఖపట్నం మధ్య పూర్తి కావడమే కాదు.. పలువురు నేతలు విశాఖపట్నం వరకు వందేభారత్ ట్రైన్ను పొడిగించాలని విజ్ఞప్తులు చేయగా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా విశాఖ వరకు పొడిగించింది.
ఇదిలా ఉంటే ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది. ఆయా స్టేషన్లలో మాత్రమే ఈ ట్రైన్ అగనుంది. ఈ వందేభారత్ రైలు గరిష్టంగా 180 కిమీ వేగంతో ప్రయాణించే సామర్ధ్యం కలిగి ఉంది. అంతేకాకుండా ఈ వందేభారత్ ట్రైన్.. ప్రస్తుతం నడుస్తోన్న జన్మభూమి ఎక్స్ప్రెస్ తరహాలో నడవనున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి ప్రయాణికులు గతంలో పన్నెండు నుండి పద్నాలుగు గంటలతో పోలిస్తే ఇప్పుడు ఎనిమిది గంటల్లోనే విశాఖపట్నం చేరుకోవచ్చు. ఈ రైలులో 16 కోచ్లు ఉండగా, మొత్తం 1128 సీట్లు ఉంటాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..