‘శాకుంతలం’ సమంత కెరీర్కి ఎంత వరకూ యూజ్ అవుతుందో.!
- January 10, 2023
గుణ శేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ‘శాకుంతలం’. సమంత లీడ్ రోల్ పోషిస్తోంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో మేల్ లీడ్ పాత్ర పోషిస్తున్నాడు. ఫిబ్రవరి 17న సినిమా రిలీజ్ వుండడంతో, ప్రమోషన్లు షురూ చేసింది గుణ్ శేఖర్ అండ్ టీమ్.
అందులో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కి సమంత కూడా హాజరైంది. చాలా కాలం తర్వాత సమంతను మీడియా ముఖంగా చూసిన అభిమానులు ఖుషీ అయ్యారు. మరోవైపు సమంత కూడా చాలా ఎమోషనల్ అయ్యింది. మయోసైటిస్ వ్యాధి బారిన పడి, ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత, ఈ సినిమా ప్రమోషన్ల కోసమే విదేశాల నుంచి తిరిగొచ్చింది.
కాగా, ‘శాకుంతలం’ విషయానికి వస్తే, ఎప్పటిలాగే సమంత తనదైన నటన కనబరిచినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. శకుంతలగా సమంత తన నటనతో కట్టిపడేసేలానే వుంది. తెలుగమ్మాయ్ అనన్య నాగళ్ల సమంతకు చెలికత్తెగా నటిస్తోంది. సీనియర్ నటుడు మోహన్ బాబు దుర్వాస మహర్షి పాత్రలో కనిపించనున్నారు.
గుణ శేఖర్ తనదైన టేకింగ్ విజువల్ ఎఫెక్ట్ట్స్తో ‘శాకుంతలం’ ట్రైలర్ని బాగానే కట్ చేశారు. మరి, సినిమా ఎలా వుండబోతోందో ఫైనల్ రిజల్ట్ తెలియాలంటే ఫిబ్రవరి 17 వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







