ఖతార్ లో నాలుగు ట్రక్కులు సీజ్
- January 11, 2023
ఖతార్: సహజ వాతావరణాన్ని దెబ్బతీసినందుకు నాలు ట్రక్కులను స్వాధీనం చేసుకున్నట్లు పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రక్కుల డ్రైవర్లపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో సిమెంట్ మిక్సర్, ట్యాంకర్, జేసీబీలు ఉన్నాయని వాటి ఫోటోలను మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది. వన్యప్రాణి అభివృద్ధి విభాగానికి చెందిన వన్యప్రాణి పునరావాస యూనిట్ ఇన్స్పెక్టర్లు నర్సరీలోకి ప్రవేశించి మొక్కలను ధ్వంసం చేసిన నాలుగు ట్రక్కులను స్వాధీనం చేసుకున్నాయని ట్వీట్ లో మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. హెవీ వెహికిల్ డ్రైవర్లు, క్యాంపింగ్ ప్రాంతాలను సందర్శించే క్యాంపర్లు తమ వాహనాలను పచ్చికభూములు, కూరగాయల ఫ్లాట్లలోకి తీసుకురావద్దని పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







