ఖతార్ లో నాలుగు ట్రక్కులు సీజ్

- January 11, 2023 , by Maagulf
ఖతార్ లో నాలుగు ట్రక్కులు సీజ్

ఖతార్: సహజ వాతావరణాన్ని దెబ్బతీసినందుకు నాలు ట్రక్కులను స్వాధీనం చేసుకున్నట్లు పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రక్కుల డ్రైవర్లపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో సిమెంట్ మిక్సర్, ట్యాంకర్, జేసీబీలు ఉన్నాయని వాటి ఫోటోలను మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది. వన్యప్రాణి అభివృద్ధి విభాగానికి చెందిన వన్యప్రాణి పునరావాస యూనిట్ ఇన్‌స్పెక్టర్లు నర్సరీలోకి ప్రవేశించి మొక్కలను ధ్వంసం చేసిన నాలుగు ట్రక్కులను స్వాధీనం చేసుకున్నాయని ట్వీట్ లో మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. హెవీ వెహికిల్ డ్రైవర్లు, క్యాంపింగ్ ప్రాంతాలను సందర్శించే క్యాంపర్‌లు తమ వాహనాలను పచ్చికభూములు, కూరగాయల ఫ్లాట్లలోకి తీసుకురావద్దని పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com