జమ్మూ కశ్మీర్ లో విషాదకర ఘటన..ముగ్గురు సైనికులు మృతి

- January 11, 2023 , by Maagulf
జమ్మూ కశ్మీర్ లో విషాదకర ఘటన..ముగ్గురు సైనికులు మృతి

జమ్మూ కశ్మీర్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధుల్లో భాగంగా గస్తీ కాస్తున్న ముగ్గురు సైనికులు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయారు.దీంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. నార్త్ కశ్మీర్ లోని కుప్వారాలో 14వ బెటాలియన్ కు చెందిన ఒక అధికారి, ఇద్దరు జవాన్లు మృతి చెందారు.

ఫార్వార్డ్ ఏరియాలో ఈ ముగ్గురూ విధులు నిర్వహిస్తుండగా మంచు పెళ్లలు విరిగిపడడంతో ..పట్టుతప్పి వాళ్లు ముగ్గురూ లోయలో పడిపోయారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం లోయలో పడిన సైనికుల కోసం గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు దొరికాయని చీనార్ కోర్ కు చెందిన అధికారులు వివరించారు. కాగా, ఈ ప్రమాదంలో చనిపోయిన సైనికులు, అధికారి ఎవరనే వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com