సొంతూళ్లకు పయనమైన హైదరాబాద్ వాసులు..
- January 12, 2023
హైదరాబాద్: సంక్రాంతి వచ్చిందంటే చాలు చాలు హైదరాబాద్ నగరం ఖాళీ అవుతుంది. దాదాపు 75 % మంది సొంతూళ్లకు పయనమవుతారు. తెలుగు ప్రజలు జరుపుకునే పండగల్లో సంక్రాంతి పెద్ద పండగ. తెలంగాణ లో కంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే సంక్రాంతి పండగకు వారి సొంత ఊరికి వచ్చి కుటుంబ సభ్యులతో గ్రామస్థులతో పండగను జరుపుకుంటారు. సినీ, రాజకీయ , సామాన్య ఇలా అంత కూడా తమ ఫ్యామిలీ సభ్యులతో ఘనంగా ఓ వారం పాటు ఘనంగా జరుపుకుంటారు.
ఇక ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకలే కనిపిస్తున్నాయి. ఈరోజు నుండి స్కూల్స్ , కాలేజీలకు సెలవులు ఇవ్వడం తో సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో అన్ని టోల్ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అధికమైంది. ఈనేపథ్యంలో చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. అయితే టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా అధికారులు ముందుగానే చర్యలు తీసుకున్నారు. టోల్ బూత్లలో రెండు సెకన్లకే వాహనాలు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడంతో వాహనాలు తొందరగా వెళ్తున్నాయి. జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జోన్, బ్లాక్ స్పాట్ల వద్ద అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు హైవేపై గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. పంతంగితోపాటు కొర్లపాడ్, చిల్లకల్లు టోల్ప్లాజాల వద్ద పటిష్ట చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







