గంగా విలాస్ క్రూయిజ్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- January 13, 2023ప్రపంచం లోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ ఎంవీ గంగా విలాస్ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియా కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.అదే విధంగా వారణాసిలోని గంగా నది ఒడ్డున ‘టెన్త్ సిటీ’ని, అదేవిధంగా కోట్ల నిధులతో అనేక ఇతర అంతర్గత జల మార్గాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు భారతదేశంలో పర్యాటక రంగానికి కొత్త యుగానికి నాంది పలుకుతుందని చెప్పారు.
గంగా నంది పై ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ సర్వీస్ ప్రారంభం కావటం ఒక మైలురాయి అని ప్రధాని మోదీ అన్నారు. గంగా నది మనకు కేవలం నది మాత్రమే కాదని, ప్రాచీన కాలం నుంచి గుర్తులకు సాక్షిగా నిలుస్తోందని తెలిపారు. గంగామాత భారతీయులను ఎల్లవేళలా పెంచి పోషించిందని అన్నారు. అయితే, స్వాతంత్ర్యానంతరం నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు లక్షలాది మంది వలసబాట పట్టారని, ఈ పరిస్థితిని మార్చాల్సిన అ వసరం ఉందని అన్నారు.ఈ క్రమంలోనే ఒకవైపు నమామి గంగ పేరుతో గంగానది పరిశుభ్రతకు కృషి చేశామని మోదీ గుర్తు చేశారు.
గంగా విలాస్లో ప్రయాణిస్తున్న విదేశీ పర్యాటకులకు మీరు ఊహించగలవన్నీ భారతదేశంలో ఉన్నాయని మోదీ తెలిపారు. ఇదిలాఉంటే ఎంవీ గంగా విలాస్కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్గా గంగా విలాస్కు పేరుంది. ఇది 51 రోజులు దాదాపు 3,200 కి.మీ పైగా ప్రయాణిస్తుంది. 36 మంది పర్యాటకులను తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. విలాసవంతమైన సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. బంగ్లాదేశ్, ఇండియాల్లో 27 నదీ వ్యవస్థల మీదుగా ఈ క్రూయిజ్ ప్రయాణిస్తుంది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..