తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- January 13, 2023
అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు, ప్రత్యేకించి రాష్ట్ర ప్రజానీకానికి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియ జేశారు.భోగి మంటలు, రంగ వల్లులు, హరి దాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, ధాన్యపు సిరులు గ్రామ సీమలకు సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని గవర్నర్ పేర్కొన్నారు.సంక్రాంతి మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ అన్నారు.పండుగ శుభవేళ తెలుగు లోగిళ్ళలో ఆనంద సిరులు వెల్లివిరియాలన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వ దినాలను ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని. ఈ పండుగ సంబరాలు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో పురోగతిని తీసుకురావాలని గవర్నర్ హరిచందన్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







