వినియోగదారుల రక్షణ అథారిటీ దాడులు.. 55 దుకాణాలకు నోటీసులు
- January 15, 2023
మస్కట్: అల్ బతినా నార్త్ గవర్నరేట్లో వినియోగదారుల రక్షణ అథారిటీ తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా 50కి పైగా వాణిజ్య దుకాణాలపై దాడులు నిర్వహించింది. పొగాకు, సిగరెట్లు, వాటి ఉత్పన్నాలను విక్రయించే దుకాణాలు, కిరాణా, ఇస్త్రీ దుకాణాలపై ఆకస్మిక తనిఖీ ప్రచారాన్ని కన్స్యూమర్ సర్వీసెస్, మార్కెట్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర అల్ బతినా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ నిర్వహించింది. వినియోగదారుల రక్షణ చట్టంలో నిర్దేశించబడిన చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన అనేక వస్తువులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్యాంపెయిన్ నార్త్ అల్ బతినా గవర్నరేట్లోని అన్ని విలాయత్లలో జరిగాయి. ఈ సందర్భంగా నమిలేపొగాకు, ఎలక్ట్రానిక్ సిగరెట్లు(144) స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 55 దుకాణాలకు నోటీసులు అందజేసినట్టు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







