తొమ్మిది అంతస్తుల అపార్ట్మెంట్ పై క్షిపణితో దాడి చేసిన రష్యా..
- January 15, 2023
రష్యా పై ఉక్రెయిన్ దాడులు కొనసాగుతున్నాయి. ఎత్తైన భవనాలు, విద్యుత్ కేంద్రాలపై రష్యా భీకర దాడులు చేస్తోంది. తాజాగా, ఉక్రెయిన్ లోని ఓ తొమ్మిది అంతస్తుల అపార్ట్మెంట్పై రష్యా దాడులు చేసింది. దీంతో ఆ అపార్ట్మెంట్ కుప్పకూలిపోయింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. డినిప్రొలో ఈ దాడి జరిగింది. రష్యా దాడిలో మరో 64 మంది గాయపడ్డారని, అలాగే, సహాయక బృందాలు మరో 37 మందిని రక్షించాయని ఉక్రెయిన్ పేర్కొంది. తాజా దాడి నేపథ్యంలో తమకు మరిన్ని ఆయుధాలు ఇవ్వాలని పశ్చిమ దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరారు.
‘‘రష్యా దుందుడుకు చర్యలను ఆపడం ఇక సాధ్యం కాదా?’’ అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు, ఉక్రెయిన్ కు 14 యుద్ధ ట్యాంకులు, ఇతర ఆయుధాలు పంపుతామని యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ ప్రకటించారు. ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో కీలక ప్రదేశాలపై కూడా రష్యా దాడులు చేసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ కేంద్రాలు ధ్వంసం కావడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
రష్యా చేసిన దాడులను ఖండిస్తున్నామని అమెరికా సహా పలు దేశాలు ప్రకటించాయి. ఉక్రెయిన్ భూభాగం తమదేనని వాదిస్తోన్న రష్యా దాన్ని స్వాధీనం చేసుకోవాడనికి కొన్ని నెలలుగా యుద్ధం చేస్తోంది. రష్యా దాడులను పశ్చిమ దేశాల సాయంతో ఉక్రెయిన్ ఎదుర్కొంటోంది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







