రన్ వే పై కుప్పకూలిన విమానం..40 మంది మృతి
- January 15, 2023
నేపాల్: నేపాల్లోని పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వేపై ఓ విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. విమానానికి మంటలు అంటుకున్నాయి.సహాయక బృందాలు కొందరు ప్రయాణికులను కాపాడి ఆసుపత్రికి తరలించారు.విమాన ప్రమాదంలో 40 మంది మృతి చెందారని ఓ ఆర్మీ అధికారి తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విమానాశ్రయానికి వచ్చే విమానాలను వేరే చోటుకి మళ్లించే అవకాశం ఉంది. కుప్పకూలిన ఆ విమానం యతి విమానాయాన సంస్థకు చెందిన ఏటీఆర్ 72 విమానమని అధికారులు తెలిపారు.
అది కాఠ్మాండూ నుంచి పొఖ్రా వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని అన్నారు. విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు, పొగ వెలువడుతోంది. ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







