రన్ వే పై కుప్పకూలిన విమానం..40 మంది మృతి
- January 15, 2023
నేపాల్: నేపాల్లోని పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వేపై ఓ విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. విమానానికి మంటలు అంటుకున్నాయి.సహాయక బృందాలు కొందరు ప్రయాణికులను కాపాడి ఆసుపత్రికి తరలించారు.విమాన ప్రమాదంలో 40 మంది మృతి చెందారని ఓ ఆర్మీ అధికారి తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విమానాశ్రయానికి వచ్చే విమానాలను వేరే చోటుకి మళ్లించే అవకాశం ఉంది. కుప్పకూలిన ఆ విమానం యతి విమానాయాన సంస్థకు చెందిన ఏటీఆర్ 72 విమానమని అధికారులు తెలిపారు.
అది కాఠ్మాండూ నుంచి పొఖ్రా వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని అన్నారు. విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు, పొగ వెలువడుతోంది. ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







