రన్ వే పై కుప్పకూలిన విమానం..40 మంది మృతి
- January 15, 2023
నేపాల్: నేపాల్లోని పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వేపై ఓ విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. విమానానికి మంటలు అంటుకున్నాయి.సహాయక బృందాలు కొందరు ప్రయాణికులను కాపాడి ఆసుపత్రికి తరలించారు.విమాన ప్రమాదంలో 40 మంది మృతి చెందారని ఓ ఆర్మీ అధికారి తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విమానాశ్రయానికి వచ్చే విమానాలను వేరే చోటుకి మళ్లించే అవకాశం ఉంది. కుప్పకూలిన ఆ విమానం యతి విమానాయాన సంస్థకు చెందిన ఏటీఆర్ 72 విమానమని అధికారులు తెలిపారు.
అది కాఠ్మాండూ నుంచి పొఖ్రా వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని అన్నారు. విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు, పొగ వెలువడుతోంది. ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







