హైదరాబాద్లో కొత్త తరహా మోసం
- January 16, 2023
హైదరాబాద్: హైదరాబాద్ లో కొత్త తరహా దాడులు జరుగుతున్నాయి. ముందుగా హోమ్ డెలివరీ పేరుతో యువకులతో ఓ మహిళ పరిచయాలు పెంచుకుని ఫోటోలు దిగుతుంది. ఆ తర్వాత హనీ ట్రాప్ చేసి తన ముఠాతో ఫోటోలు దిగిన వారిపై దాడులు చేయిస్తోంది. ఫోటోలు దిగిన మరుసటి రోజు వారి ఇంటి ముందు ఆ మహిళ హల్ చల్ చేస్తుంది.
ఇప్పటికే కొంత మంది యువకులను బెదిరించి వారి నుంచి రూ.8లక్షలు వసూలు చేసింది. హైదరాబాద్ లో హనీట్రాప్ దాడులపై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కరోజే సెంట్రల్ జోన్ పరిధిలో 6 కేసులు నమోదయ్యాయి. హనీట్రాప్ కేసులు పెరిగిపోతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
మోసాలకు పాల్పడుతున్న హనీ ట్రాప్ ముఠాను అరెస్ట్ చేశారు. హనీట్రాప్ కి పాల్పడ్డ మహిళ పరారీ కాగా, 12మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి లక్షన్నర రూపాయల నగదుతో పాటు 3 బైక్ లు, 12 ఫోన్లు, పది కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- QFC వెబ్ సమ్మిట్..కంపెనీ ఉచితంగా నమోదు..!!
- దక్షిణ అల్ బతినా గవర్నరేట్లో కోటలు పునరుద్ధరణ..!!
- మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- కువైట్ ఇ-వీసా సైబర్ ఫ్రాడ్ ను ఛేదించిన CBI..!!
- 20 మిలియన్ దిర్హమ్లు గెలిచిన భారత ప్రవాసుడు..!!
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ







