ట్రాఫిక్ జరిమానాలపై వైరల్ పోస్ట్.. వివరణ ఇచ్చిన పోలీసులు

- January 17, 2023 , by Maagulf
ట్రాఫిక్ జరిమానాలపై వైరల్ పోస్ట్.. వివరణ ఇచ్చిన పోలీసులు

యూఏఈ: ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి జరిమానాలు విధించేందుకు ఎమిరేట్ వీధుల్లోని నిఘా కెమెరాలను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలను అజ్మాన్ పోలీసులు ఖండించారు. సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్ట్ ఫేక్ అని పోలీసులు తెలిపారు. ఎవరు పోస్ట్ చేశారనే దానిపై దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేస్తామని అధికార యంత్రాంగం తెలిపింది. యూఏఈ నకిలీ వార్తలకు వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. ఒక ఫెడరల్ చట్టం ప్రకారం.. తప్పుడు వార్తలు, పుకార్లు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచురించడం, ప్రసారం చేయడం లేదా వ్యాప్తి చేయడం కోసం Dh100,000 జరిమానా, జైలు శిక్షను విధించే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com