అరబ్ లీడర్స్ కన్సల్టేటివ్ మీటింగ్లో పాల్గొన్న బహ్రెయిన్ రాజు
- January 19, 2023
అబుధాబి: అబుధాబిలో జరిగిన అరబ్ లీడర్స్ కన్సల్టేటివ్ మీటింగ్లో బహ్రెయిన్ రాజు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ మరింత స్థిరమైన, సంపన్నమైన భవిష్యత్తును నిర్మించడంలో ఉమ్మడి అరబ్ చర్యకు మద్దతు ఇవ్వడానికి బహ్రెయిన్ కట్టుబడి ఉందన్నారు. హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నిన్న అబుధాబిలో యూఏఈ అధ్యక్షుడు హెచ్హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఒమన్ సుల్తాన్ హెచ్ఎం హైతం బిన్ తారిక్, ఖతార్ ఎమిర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, జోర్డాన్ రాజు హెచ్ఎం అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్, ఈజిప్ట్ ప్రెసిడెంట్ హెచ్ఇ అబ్దెల్ఫత్తా అల్ సిసీ కూడా పాల్గొన్నారు. "పాస్పరిటీ అండ్ స్టెబిలిటీ ఇన్ ద రిజియన్ " అనే థీమ్తో నిర్వహించిన ఈ సమావేశంలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి, పురోగతి, శ్రేయస్సు, భవిష్యత్తులో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే అన్ని రంగాలలో ఆయా దేశాల మధ్య సోదర సంబంధాలు, సహకారం, సమన్వయం గురించి అరబ్ నాయకులు చర్చించారు.వీటితోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు, భాగస్వామ్య ఆసక్తి, రాజకీయ, భద్రత, ఆర్థిక సవాళ్ల గురించిన విషయాలపై కూడా సమీక్షించారు. దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే సూత్రాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా అరబ్ నేతలు నిర్ణయించారు.
తాజా వార్తలు
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- భోగాపురం నుంచి తొలిరోజు 31 విమాన సర్వీసులు
- కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!
- ఖతార్లో వినియోగదారుల భద్రతకు పెద్దపీట..!!
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం







