అల్లు అర్జున్‌కు ‘గోల్డెన్ వీసా’ జారీ చేసిన యూఏఈ ప్రభుత్వం

- January 20, 2023 , by Maagulf
అల్లు అర్జున్‌కు ‘గోల్డెన్ వీసా’ జారీ చేసిన యూఏఈ ప్రభుత్వం

దుబాయ్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దేశమంతటా పుష్ప సినిమాతో చాలా పాపులర్ అయిపోయాడు. పుష్ప ముందు వరకు తెలుగు, మలయాళంలో స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ ఇప్పడు దేశవ్యాప్తంగా పేరు, అభిమానులని సంపాదించుకున్నాడు. బన్నీ నుంచి పుష్ప 2 సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు.ఇటీవలే పుష్ప 2 సినిమా షూటింగ్ ని కూడా మొదలుపెట్టారు.

తాజాగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.దుబాయ్ ప్రభుత్వం అల్లు అర్జున్ కి గోల్డెన్ వీసా అందించింది.ఓ దుబాయ్ అధికారితో కలిసి అల్లు అర్జున్ దిగిన ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసి..ఒక మంచి అనుభూతిని ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు దుబాయ్. గోల్డెన్ వీసా ఇచ్చినందుకు ధన్యవాదాలు. త్వరలో మళ్ళీ దుబాయ్ వస్తాను అని పోస్ట్ చేశాడు.దీంతో బన్నీ గోల్డెన్ వీసా అందుకోవడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకు ముందు.. చిత్ర పరిశ్రమకు చెందిన షారుఖ్‌ఖాన్‌,కమల్ హస్సన్,సంజయ్ దత్, దుల్కర్‌ సల్మాన్‌, త్రిష, అమలాపాల్, మోహన్‌లాల్‌, మమ్ముట్టి, టొవినో థామస్‌ తదితరులు ఆ వీసాను పొందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com