సైన్స్, టెక్నాలజీ, స్పేస్లో బ్రిటన్, భారత్ లతో వ్యూహాత్మక భాగస్వామ్యం: సౌదీ
- January 21, 2023
దావోస్: సైన్స్, టెక్నాలజీ, స్పేస్లో బ్రిటన్, భారత్ లతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ మేరకు సౌదీ కమ్యూనికేషన్స్, IT ఇంజినీర్ మంత్రి అబ్దుల్లా అల్-స్వాహా పేర్కొన్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2023 వార్షిక సమావేశంలో భాగంగా బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ బిజినెస్, ఎనర్జీ, ఇండస్ట్రియల్ స్ట్రాటజీ గ్రాంట్ షాప్స్, భారతీయ రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ లతో అల్-స్వాహా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సైన్స్, టెక్నాలజీ, అంతరిక్ష రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం గురించి చర్చించారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్, డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించారు. రెండు సమావేశాలకు సౌదీ అరేబియా కమ్యూనికేషన్స్, స్పేస్ & టెక్నాలజీ కమిషన్ (CST) గవర్నర్ డాక్టర్ మహమ్మద్ అల్-తమీమి హాజరయ్యారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







