సైన్స్, టెక్నాలజీ, స్పేస్లో బ్రిటన్, భారత్ లతో వ్యూహాత్మక భాగస్వామ్యం: సౌదీ
- January 21, 2023
దావోస్: సైన్స్, టెక్నాలజీ, స్పేస్లో బ్రిటన్, భారత్ లతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ మేరకు సౌదీ కమ్యూనికేషన్స్, IT ఇంజినీర్ మంత్రి అబ్దుల్లా అల్-స్వాహా పేర్కొన్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2023 వార్షిక సమావేశంలో భాగంగా బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ బిజినెస్, ఎనర్జీ, ఇండస్ట్రియల్ స్ట్రాటజీ గ్రాంట్ షాప్స్, భారతీయ రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ లతో అల్-స్వాహా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సైన్స్, టెక్నాలజీ, అంతరిక్ష రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం గురించి చర్చించారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్, డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించారు. రెండు సమావేశాలకు సౌదీ అరేబియా కమ్యూనికేషన్స్, స్పేస్ & టెక్నాలజీ కమిషన్ (CST) గవర్నర్ డాక్టర్ మహమ్మద్ అల్-తమీమి హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?







