సైన్స్, టెక్నాలజీ, స్పేస్లో బ్రిటన్, భారత్ లతో వ్యూహాత్మక భాగస్వామ్యం: సౌదీ
- January 21, 2023
దావోస్: సైన్స్, టెక్నాలజీ, స్పేస్లో బ్రిటన్, భారత్ లతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ మేరకు సౌదీ కమ్యూనికేషన్స్, IT ఇంజినీర్ మంత్రి అబ్దుల్లా అల్-స్వాహా పేర్కొన్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2023 వార్షిక సమావేశంలో భాగంగా బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ బిజినెస్, ఎనర్జీ, ఇండస్ట్రియల్ స్ట్రాటజీ గ్రాంట్ షాప్స్, భారతీయ రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ లతో అల్-స్వాహా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సైన్స్, టెక్నాలజీ, అంతరిక్ష రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం గురించి చర్చించారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్, డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించారు. రెండు సమావేశాలకు సౌదీ అరేబియా కమ్యూనికేషన్స్, స్పేస్ & టెక్నాలజీ కమిషన్ (CST) గవర్నర్ డాక్టర్ మహమ్మద్ అల్-తమీమి హాజరయ్యారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







