యూఏఈలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి Dhs100,000 జరిమానా, ఏడాది జైలు
- January 22, 2023
యూఏఈ: ప్రభుత్వ ఉద్యోగల విధులకు ఆటంకం కలిగించినా.. దాడులకు పాల్పడిన వారికి Dhs100,000 వరకు జరిమానా, ఏడాది వరకు జైలుశిక్ష విధించనున్నారు. ఈ మేరకు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (PP)తన సోషల్ మీడియా ఖాతాలలో పబ్లిక్ ఉద్యోగులపై దాడికి సంబంధించిన జరిమానా, జైలుశిక్ష గురించి తెలిపే పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. నేరాలు, జరిమానాలపై ఫెడరల్ డిక్రీ-లా నెం.31 2021లోని ఆర్టికల్ 297 ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులపై బలవంతంగా, హింసాత్మకంగా లేదా బెదిరింపులకు ఎవరైనా దిగితే.. ఆరు నెలల కంటే తక్కువ కాకుండా జైలుశిక్ష, Dhs100,000 వరకు జరిమానా విధించబడుతుందని తెలిపింది. ఈ పోస్ట్ కమ్యూనిటీ సభ్యులలో చట్టపరమైన సంస్కృతిని ప్రోత్సహించడానికి, దేశంలోని తాజా చట్టం గురించి అవగాహనను పెంచడానికి నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఈ పోస్ట్ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







