ఏపీ జర్నలిస్టులకు భారీ షాక్ ఇచ్చిన సీఎం జగన్
- January 22, 2023
అమరావతి: సీఎం జగన్ ఎవర్ని వదిలిపెట్టడం లేదు..వరుస పెట్టి అందరికి షాక్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు గగ్గోలు పెడుతుండగా..ఇప్పుడు జర్నలిస్టుల వంతు వచ్చింది. రాష్ట్రంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న రిపోర్టర్లు వృత్తి పన్ను కట్టాలంటూ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు చర్చ గా మారింది.
అమలాపురంలో వివిధ పత్రికలు టీవీ చానెల్స్ లలో పనిచేస్తున్న 28 మంది విలేకరులకు జనవరి 17న నోటీసులు అందాయి. అమలాపురంలోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ సర్కిల్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయి. 2018-19 నుంచి 2022-23 వరకు సంవత్సరానికి రూ. 2500 చొప్పున మొత్తం రూ. 12,500 చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. 15 రోజుల్లోగా చెల్లించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
దీంతో నోటీసులు అందుకున్న విలేకర్లు వాణిజ్యపన్నుల అధికారి సుబ్బారావును కలిశారు. నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి ప్రభుత్వ అక్రెడిటేషన్ కార్డులు ఉన్న రిపోర్టర్ల నుంచి వృత్తిపన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని అందుకే నోటీసులు జారీ చేశామని సమాధానం చెప్పారు. కాగా గతంలో రాజంపేటలోనూ ఇదే విధంగా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అప్పుడు రిపోర్టర్లు ఆందోళనలు చేయడంతో నోటీసులు వెనక్కి తీసుకుంది. మళ్లీ కోనసీమలో ఈ వ్యవహారం తెరపైకి రావడంతో ఏపీలోని వివిధ పత్రికలు ఛానళ్లలో పనిచేస్తున్న రిపోర్టర్లు ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నారు. పక్క రాష్ట్ర సీఎం జర్నలిస్టులకు పక్కా ఇళ్లు మంజూరు చేస్తూ వారికి కావాల్సిన సదుపాయాలు అందిస్తుంటే..జగన్ మాత్రం ఇలా బాదుడు కార్యక్రమం పెట్టుకున్నారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







