తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు
- January 25, 2023హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. 60 మంది ఆఫీసర్లను ట్రాన్స్ ఫర్ చేశారు.వనపర్తి, సిరిసిల్ల, మహబూబ్ నగర్, రామగుండం, కరీంనగర్ ఎస్పీలు, సీపీలు బదిలీ అయ్యారు.మల్కాజ్ గిరి డీసీపీగా జానకి దరావత్, రామగుండం సీపీగా సుబ్బారాయుడు, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రాజీవ్ రతన్, ఉమెన్ సేఫ్టీ ఎస్పీగా పద్మజ, ఖమ్మం సీపీగా సురేశ్, జగిత్యాల ఎస్పీగా భాస్కర్ బదిలీ అయ్యారు.
రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి.భారీగా అధికారులు ట్రాన్సఫర్ అయ్యారు. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఉత్తర్వులు వచ్చాక ఎవరెవరు ఎక్కడెక్కడికి బదిలీ అయ్యారు అనే దాని పై పూర్తిగా క్లారిటీ వస్తుంది. జనవరి 4న 29మంది ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. ఈ నెలలోనే ఐపీఎస్ ల బదిలీలు జరగడం ఇది రెండోసారి. లాంగ్ స్టాండింగ్ పీరియడ్ లో ఉన్నవారిని బదిలీలు చేయడం జరిగింది. ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి డీజీపీ అంజనీ కుమార్.. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశం నిర్వహించినట్లు సమాచారం అందుతోంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు